ఏడు అద్భుతాలు

ఒక చిన్న పల్లెటూరిలో దాదాపు 50 ఇళ్లు మాత్రమే ఉండేవి. అక్కడ ఉండే ప్రజలు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. వారి పిల్లలని అక్కడే ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివించేవారు. కానీ.., ఆ స్కూల్ లో కేవలం నాల్గవ తరగతి వరకే ఉంది. అందరు అక్కడివరకే చేదువుకుని స్కూల్ మానేసేవారు. ఇక వారి తల్లి తండ్రులతో వెళ్లి వ్యవసాయం చేయడం మొదలు పెట్టేవారు. అక్కడే ఉండే రాజు- సునీత లకి ఒక్కగానొక్క కూతురు సహస్ర. తాను కూడా అందరిలాగే  నాల్గవ తరగతి వరకు చదువు కంప్లీట్ చేసి, ఆ తరువాతి  చదువు కోసం టౌన్ కి వెళ్తానని సునీతకి చెప్పింది.  అది విన్న వారిద్దరు,  టౌన్ కి వెళ్లి చదవడం అంటే చాలా  కష్టం మనకు అంత స్థోమత లేదని బుజ్జగించారు. కానీ, సహస్ర మాత్రం పట్టు వదలలేదు. ఇక చేసేది ఏమిలేక కూతురు కోసం దాచిపెట్టిన డబ్బుని తీసి టౌన్