నీడ నిజం - 41

  • 3.7k
  • 1.1k

తగిన అవకాశం కోసం ఎదురుచూస్తున్న భరత్ రామ్ , జస్వంత్ లకు విద్యాధరిని ప్రపంచానికి పరిచయం చేయటానికి శంకుస్థాపన అనువైన సంధర్భం అనిపించింది . అందుకు ఒక వేదిక కావాలి . ఆ వేదిక పై విద్యా తన పునర్జన్మ రహస్యాన్ని ప్రపంచానికి చాటాలి . అందుకు రాజకీయ వర్గాల అండదండలు అవసరం . రాజకీయ ప్రముఖులు , మనస్తత్వ నిపుణులు , మేధావులకు ఆ వేది క కేంద్ర బిందువైతే ; అశేష ప్రజానీకం ముందు విద్యా వేదిక పై నిలబడి అజయ్ ను ఎదుర్కొంటే ---ఆ వేదిక చరిత్ర సృష్టించగలదు . అజయ్ అన్నివిధాలా ఆశక్తుడ వుతాడు . అతడు ప్రజా న్యాయస్థానం ముందు తలవంచక తప్పదు . శంకుస్థాపన రోజే గ్రామం లో జాతీయ స్థాయి లో ఆ సభ జరగాలి . నిజం వెలుగు చూడాలి . కోమల శాంతించాలి . ఆలోచనకు పూర్తి రూపం